
సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది. ఆయన కుమార్తె జనని వివాహ మహోత్సవం అత్యంత వేడుకగా, వైభవంగా నిర్వహించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన సూర్య తేజతో జనని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు నగరంలోని ముఖ్యులు, కుటుంబ సభ్యులు ఆత్మీయులు విచ్చేసి సందడి చేశారు. హైదరాబాద్లో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ వర్గాల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ శుభకార్యానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు, నటులు, నిర్మాతలు సాంకేతిక నిపుణులు విచ్చేసి బండ్ల గణేశ్ కుటుంబానికి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. హాజరైన ప్రముఖులకు, శ్రేయోభిలాషులకు బండ్ల గణేశ్ స్వయంగా ఎదురెళ్లి ఆత్మీయ స్వాగతం పలికారు. వేడుకకు సంబంధించిన విశేషాలు మరియు చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేశ్, రాజకీయాల్లోనూ తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నారు. కూతురి వివాహం అత్యంత కోలాహలంగా సాగడంతో ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన దంపతులు సూర్య తేజ - జనని దంపతులకు పలువురు నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్పోర్ట్ బంద్.. రేపటి నుంచి భోగాపురం