
అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే కీలక మార్పులు రాబోతున్నాయి. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనను పునరుద్ధరిస్తూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆర్థిక స్థితి, వారు పొందిన ప్రభుత్వ ప్రయోజనాలపై అధికారులు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. ఇది గ్రీన్ కార్డ్ ప్రక్రియను మరింత సంక్లిష్టంగా మార్చనుంది.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఈ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. దీని ప్రకారం.. దరఖాస్తుదారులు ప్రభుత్వ గృహ వసతి సహాయం (హౌసింగ్ అసిస్టెన్స్), ఫుడ్ స్టాంప్స్, కళాశాల విద్యకు ఆర్థిక సహాయం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందితే, వారి దరఖాస్తులను పరిశీలించేటప్పుడు అధికారులు ఆ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వానికి భారం (పబ్లిక్ ఛార్జ్) అయ్యే అవకాశం ఉందా? లేదా? అని అంచనా వేస్తారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో 2022లో తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ కొత్త తుది రూల్ను జులై 16న ప్రకటించింది.సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత పోస్ట్మార్క్ చేయబడిన లేదా ఆన్లైన్లో సమర్పించిన గ్రీన్ కార్డ్ (ఫారం I-485) దరఖాస్తులకు ఈ కొత్త, కఠినమైన నిబంధనలు వర్తిస్తాయి. అయితే, 2022 డిసెంబర్ 23 నుంచి 2026 సెప్టెంబర్ 17 మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి పాత (2022)