
సూర్య ప్రకాష్ జోశ్యుల ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమాను గ్లోబల్ ప్రాజెక్టుగా దర్శకధీరుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా కథ ఏమై ఉండవచ్చు అనేది సినిమా అభిమానుల్లో డిస్కషన్ గా మారింది. తాజాగా, ఈ సినిమా కథ కు సంబంధించి ఒక కీలకమైన లీక్ బయిటకు వచ్చింది. అయితే ఈ కథ ఎవరో ఊరు పేరు లేని సైట్ లో ఉంటే పెద్ద విషయం కాదు,ఎవరూ పట్టించుకోపోదురు, కానీ ఈ సినిమా అఫీషియల్ బ్రాండ్ పార్టనర్ అయిన 'స్కైబ్లూ సినిమాటిక్స్' వారి వెబ్ సైట్ లో ఉండటంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మూవీకి ప్రపంచస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ పార్టనర్షిప్స్ కోసం 'స్కైబ్లూ సినిమాటిక్స్' సంస్థతో 'వారణాసి' మేకర్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బ్రాండ్ ఇంటిగ్రేషన్ హక్కులను కూడా 'స్కైబ్లూ సినిమాటిక్స్' పొందింది. వైరల్ అవుతున్న కథేంటి? ఆ సైట్ లో ఉన్న సినాప్సిస్ ప్రకారం.. కథ 2027 కాలంలో సాగుతుంది. 'శాంభవి' అనే భారీ గ్రహశకలం (Asteroid) పుణ్యక్షేత్రమైన వారణాసి వైపు దూసుకొస్తూ భూమికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు 'రుద్ర' అనే సాహసికుడైన పురాతత్వ శాస్త్రవేత్త (మహేష్ బాబు) సీన్ లోకి వస్తాడు. వారణాసి కి సంబంధించి గతంలో దాగి ఉన్న ఒక ప్రాచీన విశ్వ ఖగోళ పరికరాన్ని (Cosmic artefact) వెతికే గ్లోబల్ మిషన్ను ఆయన చేపడతారు. ఈ వేటలో రుద్రకు మందాకిని (ప్రియాంక చోప్రా) అనే చరిత్రకారిణి తోడుగా నిలుస్తుంది. ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ఖండాలు, యూరప్లలో సాగే ఈ అడ్వెంచర్లో, 'కుంభ' అనే విలన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) వీరిద్దరినీ వెంటాడుతుంటాడు. ఇక్కడే
