
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్లలోని కురవపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పీఆర్టీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రవిప్రకాశ్ (61)గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. మండల విద్యాధికారులు రవిప్రకాశ్ స్వగ్రామమైన కోడుమూరు పట్టణానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని వారు కొనియాడారు. మండలంలోని యుటీఎఫ్, డీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మృతదేహానికి పూలమాలలువేసి సంతాపం తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు