
గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయులు 80వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించి భారతీయ ఎంబసీల వేడుకల్లో పూర్తి ఆరు చరణాల వందేమాతర గేయాన్ని ఆలపించారు. సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల్లో జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు కూడా చేశారు. గతంలో ఎప్పుడూ లేని ఈసారి దుబాయిలో భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’, ‘భారత్ కో జానీయే’ కార్యక్రమాలకు కూడా విదేశాల్లో ఆశాజనకమైన స్పందన లభించింది. కాలమానం ప్రకారం సూర్యపథ్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒక దేశం తర్వాత మరో దేశంలోని ఎంబసీలు క్రమంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే వినూత్న కార్యక్రమం జరిగింది. సమయ పీఠిక ప్రకారం సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ మొదలు గల్ఫ్ లోని ఒమాన్, సౌదీ అరేబియాల్లో.. ఆపై ఇథియోపియాలో వేడుకలు జరిగాయి. దుబాయిలో నూతన కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేసి రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. పాస్పోర్టుల జారీలో గత కొంత కాలంగా పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించినట్లుగా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రవాసీయుల సంక్షేమం, భారతీయ వాణిజ్య సంబంధాల బలోపేతానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా నూతనంగా పదవీ భాద్యతలను స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డిని కలువడానికి భారతీయ ప్రముఖులు ఆసక్తి ప్రదర్శించారు. అనేక మంది తెలుగు ప్రవాసీ ప్రముఖులు కూడా ఆయనను వేదికపై కలుసుకున్నారు. తెలుగు రసమయి పక్షాన యస్వీరెడ్డి, తెలుగు అసోసియేషన్ పక్షాన మసీయోద్దీన్, దినేష్, జాఫర్, భీం, తౌఫీఖ్, సౌజన్య