
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కొనసాగింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడటంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీని ప్రభావం దేశంలోని అత్యంత విలువైన టాప్-10 కంపెనీలపై స్పష్టంగా కనిపించింది. వీటిలో ఐదు దిగ్గజ కంపెనీలు కలిసి తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) నుంచి ఏకంగా రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టపోయాయి.నష్టపోయిన కంపెనీలలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క వారంలోనే టీసీఎస్ మార్కెట్ విలువ రూ.34,263.28 కోట్లు క్షీణించి రూ.8.53 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ.31,869.13 కోట్లు తగ్గి రూ.17.70 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.25,891.88 కోట్లు నష్టపోయి రూ.9.86 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.7,165.37 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.2,792.65 కోట్లు తమ మార్కెట్ విలువను కోల్పోయాయి.లాభపడ్డ మరో ఐదు కంపెనీలు ఒకవైపు ఐదు కంపెనీలు నష్టాలపాలవ్వగా, మరో ఐదు కంపెనీలు మాత్రం లాభాలను ఆర్జించడం విశేషం. ఈ ఐదు కంపెనీలు కలిసి తమ మార్కెట్ విలువకు రూ.55,149.45 కోట్లను జోడించుకున్నాయి. లాభపడిన వాటిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ముందుంది. ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.26,438.49 కోట్లు పెరిగి రూ.5.23 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ కూడా రూ.20,592.13