
అమెరికా, ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరం వేదికగా ఇరాన్ టాప్ పొలిటికల్, మిలిటరీ నాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా నాలుగు నెలల పాటు ఆలస్యమైన ఖమేనీ అంత్యక్రియల శవయాత్రను ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక వారం పాటు అధికారికంగా నిర్వహిస్తోంది.ఈ అంత్యక్రియల ప్రార్థనలు రాజకీయ రంగును సంతరించుకున్నాయి. లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజామునే ప్రార్థనా స్థలానికి చేరుకుని, ఇరాన్ జాతీయ జెండాలతో పాటు ప్రతికారానికి ప్రతీకగా భావించే ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చాలంటూ రాసిన పోస్టర్లు, గ్రాఫిటీలు అక్కడ భారీగా వెలిశాయి. ఈ సందర్భంగా వేదికపై ఉన్న కవి మహ్మద్ రసూలీ మైకులో మాట్లాడుతూ.. "ఇకపై కఫనమే మా వస్త్రం. ట్రంప్ను చంపడం మా బాధ్యత" అని పిలుపునిచ్చారు. ప్రార్థనలకు వచ్చిన ఘోలామ్రేజా సాబూని అనే పౌరుడు కూడా, మా ఇమామ్ను చంపిన ట్రంప్ను చంపాల్సిందేనని పేర్కొన్నాడు. మరోవైపు అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్ఘోలామి స్పందిస్తూ.. "మీరు మనుషులను చంపగలరు కానీ ఆదర్శాలను కాదు, అయాతొల్లా ఖమేనీని