
రాజధాని హైదరాబాద్లో ఇదీ పరిస్థితి మొత్తం ప్రభుత్వ స్థలాలు 21.74 లక్షల చదరపు గజాలు.. దాంట్లో సగానికిపైగా న్యాయపరమైన చిక్కుల్లోనే! వాటి సమీప ఇళ్ల యజమానులకు తిప్పలు నిషేధిత జాబితాలో పెట్టడంతో క్రయవిక్రయాలకు ఆటంకం 22ఏతో హడలిపోతున్న బాధితులు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి దృష్టి సారించిన కలెక్టర్.. వివరాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం హైదరాబాద్ సిటీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో దాదాపు 12 లక్షల చదరపు గజాల ప్రభుత్వ స్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. మొత్తం ప్రభుత్వ భూమి 21.74 లక్షల చదరపు గజాల స్థలాలుండగా.. అందులో సగానికిపైగా న్యాయపరమైన వివాదాల్లోనే చిక్కుకోవటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా దృష్టి సారించారు. ‘కోర్టు కేసుల్లో ఎన్ని సర్కారు స్థలాలు ఉన్నాయి? రెవెన్యూ తరఫున కౌంటర్లు సరిగా దాఖలు చేస్తున్నారా? లేదా? వాటి తాజా పరిస్థితి ఏమిటి?’ తదితర అంశాలపై సమగ్ర వివరాలను 2-3 రోజుల్లో తనకు సమర్పించాలని రెవెన్యూ పరిధిలోని వివిధ విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్లు, అధికారులు అప్రమత్తమయ్యారు. వివిధ కోర్టుల్లో 238 కేసులు హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1139 ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకు పార్సిళ్లు ఉన్నాయి (ఏదైనా ప్రాంతంలోని మొత్తం భూమిని ఒక పార్సిల్గా పరిగణిస్తారు). మొత్తం ప్రభుత్వ ల్యాండ్ పార్సిళ్లలో 21,74,479.68 చదరపు గజాల స్థలాలుండగా.. అందులో 169 ల్యాండ్ పార్సిళ్లలోని సుమారు 11,93,595.12 చదరపు గజాల ఖాళీ స్థలం కోర్టు కేసుల్లో ఉంది. ఇందులో షేక్పేట్ మండలంలో అత్యధికంగా 50 కేసులు ఉన్నాయి. ముషీరాబాద్లో 19, ఆసి్ఫనగర్లో 23, గోల్కొండలో 18, సైదాబాద్లో 16, మారెడ్పల్లిలో 16, ఖైరతాబాద్లో 16, నాంపల్లిలో 9, సికింద్రాబాద్లో 12, అమీర్పేట్లో 13, అంబర్పేట్లో 12, బహదూర్పురాలో 3, బండ్లగూడలో 9, చార్మినార్లో 3