
Eenadu•2 Dec 2026
కేరళం పేరు మార్పు బిల్లుకు లోక్ సభ ఆమోదందిల్లీ: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చట్టసవరణ బిల్లుకూ ఆమోదం లభించింది. కేంద్రమంత్రి అమిత్షా రావాలంటూ సభలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్యే బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. కేరళం పేరు మార్పు బిల్లుకు లోక్సభ ఆమోదం