
టీమిండియాలో ఫిట్నెస్, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్లో ఒక జట్టుగా ఉన్న రోటర్డామ్ డాకర్స్ జెర్సీని మంగళవారం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జాంటీ రోడ్స్తో పాటు కో-ఓనర్, మాజీ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమిండియాలో పదునైన ఫీల్డింగ్, కెప్టెన్సీలో దూకుడు వంటి మార్పుల గురించి జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఎంఎస్ ధోని కెప్టెన్ అయ్యాకా టీమిండియాలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు జట్టులో ఉన్న సీనియర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో యువ ఆటగాళ్లతో నిండిపోయింది. ఇక కోహ్లి రాకతో ఫిట్నెస్కు ప్రాధాన్యం పెరగడంతో పాటు పదునైన ఫీల్డింగ్కు బాటలు పడ్డాయి. కోహ్లి కెప్టెన్గా అంతగా రాణించనప్పటికీ జట్టులో అందరూ ఫిట్గా ఉండాలని మాత్రం పట్టుబట్టేవాడు. ఎందుకంటే మైదానంలో ఒక మంచి ఫీల్డర్గా ఎదగాలంటే, ధృడంగా, చురుగ్గా ఉండాల్సిన అవసరముంది. అందుకే కోహ్లి ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యమిచ్చేవాడు. ఇప్పటికీ అదే ఫిట్నెస్ను కొనసాగిస్తూ జట్టులో కొనసాగుతున్నాడు. భారత జట్టులో గొప్ప ఫీల్డర్లు కొంతమందే ఉన్నారు. వారిలో కోహ్లి అగ్రస్థానంలో ఉంటాడనంలో సందేహం లేదు. ఇక ఫీల్డింగ్లో నేను ప్రాణం పెట్టేవాడిని. ఎంత ఒత్తిడి ఉన్నా మైదానంలో మాత్రం స్వేచ్ఛగా ఉండేవాడిని. 1993 హీరోకప్లో నేను ఐదు క్యాచ్లను సర్కిల్ లోపలే పట్టాను. అది ఒక అద్భతమని చెప్పొచ్చు. ఇక ఫీల్డింగ్ కోచ్గా మారిన తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు చాలాకాలం పనిచేశాను. ఈ సమయంలో కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉండేది. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి క్యాచ్ తీసుకున్న మొదటి ఆటగాడు అతడే. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఫీల్డింగ్లో సరికొత్త మార్పులు వచ్చాయి. ఒకప్పుడు జట్టులో ఒకరు