అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా కల్వర్టుపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందిలో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న వారు చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో, సహాయక చర్యలు మొదలయ్యాయి.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాలు కూడా కల్వర్టులోకి పడిపోయాయి. స్థానికులు వెంటనే రెండు వాహనాల డ్రైవర్లను బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిద్ర మత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు
Actor ProfilePolitician
కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Nov 2026
కల్వర్టులో బోల్తాపడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు