
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల వల్లే రాష్ట్రంలో వరి భారీగా పండుతోందని ఆ పార్టీనేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న అంశమని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా.. ఎందుకు భారీగా పండలేదు? కన్నెపల్లి పంపుహౌస్ను ప్రారంభించాలి. ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల్లో నీరు నింపాలి. పూర్తిగా నింపకపోయినా.. పాక్షికంగానైనా నింపాలి. ఇసుక మాఫియాను కట్టడి చేయాలి’’ అని డిమాండ్ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు