
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే టెహ్రాన్ తీవ్రంగా స్పందించింది. ఒప్పందంలోని నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తే, తాము కూడా 'తగిన ప్రతిచర్య' తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారని అక్కడి ప్రభుత్వ టీవీ వెల్లడించింది. చర్చల కోసం తాము అమెరికాను అభ్యర్థించామన్న ట్రంప్ వాదనలను కూడా ఇరాన్ తోసిపుచ్చింది. కేవలం మధ్యవర్తిగా ఉన్న ఖతార్ ప్రతినిధుల పర్యటనను మాత్రమే అంగీకరించామని స్పష్టం చేసింది.మరోవైపు ఇరాన్ నేత మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో యుద్ధం ఇరాన్ లొంగిపోవడంతో ఎప్పటికీ ముగియదని ఆయన స్పష్టం చేశారు. "ఒకవేళ అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. వారికి వ్యతిరేకంగా దృఢంగా నిలబడి, ఇరాన్ ప్రజల హక్కులను కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చర్చల సమయంలో తమకు వారిపై ఏమాత్రం నమ్మకం లేదని స్పష్టంగా చెప్పినట్లు ఘలీబాఫ్ తెలిపారు. "యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారే అమెరికాతో చర్చలు జరపగలరు" అని ఆయన వ్యాఖ్యానించారు.ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు ఆయతుల్లా రుహోల్లా ఖొమైనీ మనవడు అలీ ఖొమైనీ కూడా ఇదే తరహాలో స్పందించారు. అమెరికాతో చర్చలు అంటే శాంతి కోసం కాదని, అది కూడా యుద్ధంలో ఒక భాగమేనని అన్నారు. "నేరపూరిత అమెరికాతో మనం శాంతిని ఎలా