
ఏపీలో గతేడాది ఆగస్టు 15న సీఎం చంద్రబాబు ప్రారంభించిన స్త్రీ శక్తి (Stree Shakti Scheme)ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు ఈ ఏడాది కాలంలో ఎంతో అండగా నిలిచింది. మొదట్లో కొన్ని అంశాల్లో వ్యతిరేకత వచ్చినా, దాన్ని అధిగమించడంలో కూటమి సర్కార్ పూర్తిగా సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇదే కీలకంగా మారింది. దీన్ని మరింత విజయవంతంగా నడిపేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.ఏపీలో డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్- ఇక 10 మంది అక్కర్లేదు..!కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పుడు ఎన్నో అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ ముందుకు వెళ్లడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ముఖ్యంగా ఉచిత బస్సుల రాకతో ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి పడుతుందనే ఆందోళన వ్యక్తమైంది. దీనికి కౌంటర్ గా ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సైతం ఏటా 15 వేల సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో ఆటో డ్రైవర్ల సమస్యకు కొంత మేర చెక్ పెట్టినట్లయింది. ఏపీలో డ్వాక్రా మహిళలకు పంద్రాగస్టు కానుక- మరో కొత్త పథకం..!ఉచిత బస్సు పథకం వల్ల ముఖ్యంగా ఉద్యోగం, విద్య, షాపింగ్, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం నిత్యం ప్రయాణించే మహిళలకు ఎంతో ఉపయోగపడుతోంది. దీంతో బస్సుల్లో మహిళల ఆక్సుపెన్సీ కూడా భారీగా పెరుగుతోంది. రోజువారీ రవాణా ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండానే చాలా మంది మహిళలు ప్రయాణాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ఎన్డీయేకు రాజకీయంగా కూడా ఈ పథకం భారీ మైలేజ్ తెచ్చిపెడుతోంది. ఏపీలో ఉచిత బస్సుకు ఏడాది..! సర్కార్ కీలక నిర్ణయం..!ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకానికి వ్యతిరేకంగా బలమైన వాదనను లేదా ప్రత్యామ్నాయ అభిప్రాయాన్ని రూపొందించడంలో విపక్ష వైఎస్సార్సీపీ విఫలమైంది. ఈ అంశాన్ని ప్రభుత్వంపై పెద్ద రాజకీయ సమస్యగా మార్చడానికి బదులుగా, ఈ పథకం ఒక భారం లేదా వైఫల్యం అని మహిళలను