ఏపీ కేబినెట్ భేటీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండా
Actor ProfilePolitician

ఏపీ కేబినెట్ భేటీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ కేబినెట్ భేటీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండా
Eenadu8 Jan 2027
ఏపీ కేబినెట్ భేటీ.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండా

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో దాదాపు 55కు పైగా అజెండా అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై మంత్రివర్గం కీలకంగా చర్చించనుంది. కేబినెట్‌ భేటీ అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 33.50 శాతం, పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయనుంది. బీసీలకు రిజర్వేషన్లపై ఏర్పాటుచేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలి? అన్న కోణంలో మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కమిషన్ నివేదికను అమలుచేస్తే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ వీలు పడదు కాబట్టి, ప్రత్నాయ్నాయాలేంటి? అన్న విషయంలో లోతుగా చర్చించనున్నట్టు సమాచారం. పట్టణ స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ తీర్మానానికి నేడు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు