
ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. నెల రోజుల ఉచితంగా ఉచిత కంటి పరీక్ష సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పిలుపు. హైదరాబాద్, జూలై 10, 2026 : ఏఎస్జీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వాసన్ ఐ కేర్ హాస్పిటల్ హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో నూతన నేత్ర వైద్య కేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ఏఎస్ రావు నగర్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక, అందుబాటు ధరల్లో, సమగ్ర నేత్ర వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ నూతన కేంద్రంలో కంటిశుక్లం (క్యాటరాక్ట్), గ్లాకోమా, రెటీనా సంబంధిత వ్యాధులు, కార్నియా వ్యాధులు, చిన్నారుల నేత్ర వైద్యం, దృష్టి లోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్), మధుమేహ సంబంధిత నేత్ర వ్యాధులు వంటి విభిన్న కంటి సమస్యలకు నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యాధునిక నిర్ధారణ పరికరాలు, శస్త్రచికిత్స సదుపాయాలతో సకాలంలో చికిత్స అందిస్తూ మెరుగైన వైద్య ఫలితాలు అందించేందుకు ఈ కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, “డాక్టర్ ఏఎస్ రావు నగర్లో అత్యాధునిక సదుపాయాలతో వాసన్ ఐ కేర్ (ASG) ఆసుపత్రి ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. నాణ్యమైన నేత్ర వైద్య సేవలు ప్రజలకు వారి ప్రాంతంలోనే అందుబాటులోకి రావడం అభినందనీయం. కంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందేందుకు ఇటువంటి ప్రత్యేక ఆసుపత్రులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రజలు కంటి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైనప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఈ ఆసుపత్రి ఉప్పల్ నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందిస్తుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఫాకో రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ సుధీర్ చిమకుర్తి, క్యాటరాక్ట్ &