ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలన
Actor ProfilePolitician

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
10TV Telugu16 Jan 2027
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధం కూటమి పాలనపై జగన్ విమర్శలు ఏడాదిలో జగన్ పాదయాత్ర ప్రారంభం YS Jagan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యాధికారులతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన జగన్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎంతటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిలబడి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించాలని స్పష్టం చేశారు. Konda Sushmitha: పరకాల బరిలో దిగేది నేనే.. కళ్ళు నెత్తికెక్కినయా.. సీఎం రేవంత్ కి కొండా సుస్మిత మాస్ కౌంటర్‌? కూటమి పాలనపై విమర్శలు, లా అండ్ ఆర్డర్ వైఫల్యం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానిని నిలబెట్టుకోలేకపోయిందని, రెండేళ్ల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మద్యం, ఇసుక, మట్టి మాఫియాలు విజృంభిస్తున్నాయని దుయ్యబట్టారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక దారుణ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, కేసును తొక్కిపెట్టేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. ప్రభుత్వ విఫల విధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ నేతలు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలు, పాదయాత్రపై జగన్ ధీమా: గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ సంక్షేమ పాలనకు, ప్రస్తుత కూటమి రౌడీయిజానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రజలు పోల్చి చూస్తున్నారని జగన్ పేర్కొన్నారు. నిత్యం జనంలో ఉంటూ ప్రజ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు