
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేస్తూ శకటాలను ప్రదర్శించారు. ఉత్తమ సేవలకు గాను ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. వేడుకల్లో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు