
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. High Court: ఉద్యోగుల ఆరోగ్య పథకం( ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్) కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్ల జీతాల నుంచి 1.5 శాతం తప్పనిసరిగా కోత విధించడాన్ని సవాలు చేస్తూ బుధవారం తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొన్న ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇచ్చింది. ఆగస్టు 3వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఆదిలాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని కుష్ఠు వ్యాధి నివారణ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రాజ్ కుమార్ గుమ్మి తన వాదనలు వినిపిస్తూ, జీతాలు, పెన్షన్ల నుంచి ప్రభుత్వం బలవంతంగా ఈ కోత విధించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేస్తూ.. అంతకుముందు అక్టోబర్ 8, 2023న జారీ చేసిన జీవో నెం. 186 ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం, మూల పింఛను నుండి అత్యవసర ఆరోగ్య సేవల కోసం 1.5 శాతం కోత విధించాలని ఆదేశిస్తూ ఆర్థిక శాఖ ఇటీవల జూన్ 29, 2026న జీవో నెం. 79 జారీ చేసిందని తెలిపారు. అమెరికాలో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ సమీకృత వైద్య హాజరు బృందం చట్టం 1972.. తెలంగాణకు కూడా వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ నిబంధనల