
సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి లేదా సంక్రమణం అంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే గ్రహాల అధిపతి అయిన భాస్కరుడు జూలై 16న మిథున రాశి నుంచి చంద్రుడి సొంత రాశి కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ కర్కాటక సంక్రమణం కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాన్ని, ప్రగతిని తెస్తోంది. అయితే మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.ఈ 5 రాశుల వారికి బంగారు కాలం!సూర్యుడి ఈ గోచార మార్పు ముఖ్యంగా మిథునం, కర్కాటకం, కన్య, తుల, మీన రాశుల వారికి విపరీతమైన శుభ ఫలితాలను ఇవ్వనుంది. రావలసిన పాత బాకీలు, నిలిచిపోయిన డబ్బులు అనుకోకుండా చేతికి అందుతాయి. ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం లక్ష్మీదేవి కటాక్షంలా మారుతుంది. కొత్త డీల్స్ కుదురుతాయి.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ లేదా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న యువతీ యువకులకు అనుకూలమైన సంబంధాలు నిశ్చయమవుతాయి. మాట తీరు, సంభాషణా నైపుణ్యాలు మెరుగుపడి నలుగురిలో గౌరవం పెరుగుతుంది. కోర్టులు లేదా కుటుంబంలో ఉన్న పూర్వీకుల ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభిస్తాయి.ఈ రాశుల వారు జాగ్రత్త వహించాలి!కర్కాటకంలో సూర్యుని సంచారం వల్ల మేషం, సింహం, కుంభం రాశుల వారు కాస్త ఆచితూచి అడుగులు వేయడం మంచిది. అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దిగకపోవడమే శ్రేయస్కరం. ఆరోగ్య క్షీణత, వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ ఉండే అవకాశం ఉంది. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సాధారణం కంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు.సూర్య దోష నివారణకు పరిహారాలుజ్యోతిష్య నిపుణుల ప్రకారం.. జాతకంలో సూర్యుని బలాన్ని పెంచుకోవడానికి, ప్రతికూల ప్రభావాల నుంచి