
ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా ఈజిప్ట్తో జరిగిన ఉత్కంఠభరిత రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుని క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఒకానొక దశలో 0-2తో వెనుకబడిన డిఫెండింగ్ ఛాంపియన్స్, చివరి 11 నిమిషాల్లో ముప్పేట దాడి చేసి మూడు గోల్స్తో మ్యాచ్ను తిప్పేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సి 83వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి స్కోరును సమం చేయగా, ఇంజూరీ టైమ్లో ఎంజో ఫెర్నాండెజ్ కొట్టిన విన్నింగ్ గోల్ అర్జెంటీనాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.ఈ చారిత్రాత్మక విజయం తర్వాత మెస్సి భార్య ఆంటోనెలా రొకూజో సోషల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ మిలియన్ల మంది ఫుట్బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. మెస్సి కెరీర్ ప్రారంభం నుండి ప్రతి మైలురాయిని దగ్గరుండి చూసిన ఆంటోనెలా, మ్యాచ్ ముగిసిన తర్వాత మెర్సిడెస్-బెంజ్ స్టేడియం నుండి తన కుమారులు థియాగో, మాటియో, సిరోలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. దానికి ఆమె స్పానిష్లో "లెట్స్ గో అర్జెంటీనా.. @leomessi ఇక చెప్పడానికి మాటలు లేవు" అని రాస్తూ స్కై-బ్లూ హార్ట్ ఎమోజీలను జత చేసింది. ప్రపంచ అత్యుత్తమ ఆటగాడి ప్రదర్శనకు మాటలు కూడా సరిపోవట్లేదనే ఆమె భావన అభిమానులను కదిలించింది.మైదానంలో మెస్సిని సహచర ఆటగాళ్లు గాల్లోకి లేపి సంబరాలు చేసుకుంటున్న అద్భుతమైన చిత్రంతో పాటు, తమ కుటుంబం స్టేడియంలో అర్జెంటీనా జెర్సీలతో ఎంజాయ్ చేస్తున్న సెల్ఫీలను ఆమె షేర్ చేసింది. ఇది స్టార్ ఫుట్బాలర్ వ్యక్తిగత జీవితాన్ని చూసే అరుదైన అవకాశాన్ని