
ప్రముఖ రచయిత, దర్శకుడు వెంకీ అట్లూరి తన సినీ జీవితపు తొలినాళ్ళ గురించి, నటన ప్రయత్నాల గురించి, ఆపై రచయితగా, దర్శకుడిగా మారిన ప్రయాణం గురించి ఓ పోడ్కాస్ట్ షోలో వివరించారు. రీసెంట్ గా సూర్యతో కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో హిట్ అందుకున్నాడు వెంకీ. అలాగే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 2001 సంవత్సరంలో తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్ వంటి నూతన నటులు నువ్వే కావాలి, జయం వంటి చిత్రాలతో భారీ విజయాలను సాధిస్తున్న సమయంలో, వెంకీ కూడా నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. తరుణ్ నా క్లాస్ మెట్ అతను సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. నేను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నా అన్నారు. ఈ క్రమంలో గంగోత్రి సినిమా ఆడిషన్స్కు వెళ్ళినట్లు తెలిపారు. అయితే, ఆయనకు తొలి అవకాశాన్ని కష్టపడి సంపాదించుకోలేదని, బంధువుల పరిచయంతో అది వచ్చిందని వెల్లడించారు. పోర్ట్ఫోలియో ఉందా.? పాస్పోర్ట్ ఉందా.? అనే రెండు ప్రశ్నలతోనే ఆయనను హీరోగా ఎంపిక చేశారని, ఆ చిత్రం విడుదలై పెద్ద డిజాస్టర్ అయిందని, కేవలం ఒకే షో మాత్రమే ఆడిందని వెంకీ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి కూడా “నీకు నటన పలకడం లేదు, నువ్వు దీనికి సరిపోవు” అని మొఖం మీదే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవంతో ఫెయిల్డ్ యాక్టర్గా మిగిలిపోకూడదని వెంకీ నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత సుమారు ఒక సంవత్సరం తర్వాత, 2007-08 ప్రాంతంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన, మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన స్నేహగీతం సినిమా ఆడిషన్స్కు వెళ్ళారు. ఈ సినిమాకు నూతన నటులే కావాలి అనే నిబంధన ఉండగా, ఇప్పటికే ఒక సినిమా చేసినప్పటికీ, ఆయన మూడు-నాలుగు లెవల్స్ ఆడిషన్స్ తర్వాత ఎంపికయ్యారు. అయితే, సినిమా షూటింగ్ పది రోజులు జరిగాక, అప్పటి రచయిత తప్పుకోవడంతో చిత్ర బృందం సమస్యలో పడింది. అప్పటికే రచనపై ఆసక్తి ఉన్న వెంకీ, దర్శకుడిని