ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు
Actor ProfileActor

ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు
TV9 Telugu25 Sept 2026
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎం.ఎస్. రాజు, ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని పలు కీలక ఘట్టాలపై సంచలన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.., ‘దేవి’ సినిమా షూటింగ్‌లో పాముకు బొట్టు పెట్టే సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. అది గ్రాఫిక్స్ కాదని, నిజంగానే పాముకు బొట్టు పెట్టారని, ఆ పాము ఒకరిని కాటు కూడా వేసిందని ఎం.ఎస్. రాజు తెలిపారు. ఆ షాట్ గ్రాఫిక్స్ షాట్ కాదని, ఆ నటి కూడా భయపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘దేవి’ సినిమా తనకెన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, ఆ సమయంలో పడిన కష్టాలు తనను మానసికంగా, శారీరకంగా ఎంతగానో ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో మానసిక అలసట వల్ల కారు ప్రమాదం కూడా చేశానని తెలిపారు. ఇది తన జీవితంలో ఒక మూడేళ్ల కఠినమైన ప్రయాణమని, అటువంటి అనుభవం మళ్లీ రాకూడదని ఎం.ఎస్. రాజు అన్నారు. ‘దేవి పుత్రుడు’ సినిమా తనకెంతో అనుభవాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా పరిష్కరించాలి అనే పాఠాలను నేర్పిందని రాజు అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చినా, చివరి అరగంట తనకు నచ్చలేదని, అదే సినిమా పరాజయానికి ఒక కారణమై ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ‘దేవి పుత్రుడు’ ఫ్లాప్ అయిన తర్వాత వెంకటేష్ గారు తనతో ‘మరింత బాగా చేసి ఉండాల్సింది’ అని మాత్రమే అన్నారని, అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేదని తెలిపారు. ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా, కథ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇప్పటికీ తనకి పూర్తిగా అర్థం కాలేదని పేర్కొన్నారు. ‘మనసంతా నువ్వే’ సినిమా తన కెరీర్‌లో ఒక మలుపు అని ఎం.ఎస్. రాజు అన్నారు. ఆ సినిమా ఆలోచన 1954 నాటి హిందీ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘అన్మోల్ ఘడి’ నుండి స్ఫూర్తి పొందిందని వెల్లడించారు. అందులో పిల్లలు, వాచ్ ఐడియాను

ఆ స న మ ఎన న న ద రల న ర త ర లన మ గ ల చ ద మళ ల అల ట ద ర క డద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in