
టాలీవుడ్ లో చంద్రమోహన్ లెజెండ్రీ నటుడే అని చెప్పొచ్చు. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చంద్రమోహన్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా తన లిమిట్స్ తాను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆర్థికంగా లైఫ్ లో నిలదొక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఇండస్ట్రీలో చెడు వ్యసనాల వల్ల జీవితం నాశనం చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితిని అనుభవించిన నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర మోహన్ మాట్లాడుతూ.. నటులుగా ఎంతో గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది వ్యసనాల కారణంగా ఇబ్బంది పడ్డారు. మరికొందరు వారి సంతానం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎస్వీ రంగారావు, హరనాథ్, నాగభూషణం, రేలంగి ఇలాంటి వారంతా ఆ కోవకు చెందిన వారే. తగేవారు కొందరు, జూదం, రేసులు ఆడేవారు కొందరు.. మహిళల వ్యామోహం కొందరికి ఇలా రకరకాల వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయినోళ్లు ఉన్నారు. కొందరు సినిమా నిర్మాణం పేరుతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి చెడిపోయారు. నాగభూషణం ఎంత గొప్ప ఆర్టిస్ట్ ? ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారో నాకు తెలుసు. కానీ చివరికి ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పోగొట్టుకుని హైదరాబాద్ గాంధీనగర్ లో తన భార్యతో ఓ అవుట్ హౌస్ లో దుర్భర జీవితం గడిపారు. వీళ్లంతా చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ పిల్లలని సరిగ్గా పెంచలేదు. గోల్డెన్ స్పూన్ తో పెంచారు. దీనితో వారి పిల్లలు పెద్దయ్యాక ఇంకా ఎక్కువ లగ్జరీలు, వ్యసనాలకు అలవాటు పడ్డారు అని చంద్ర మోహన్ తెలిపారు. అందరూ పండిత పుత్రులే. రాజనాల కూతురు, హరనాథ్ కూతురు, ఎస్వీ రంగారావు కొడుకు వీళ్లంతా విచ్చల విడితనం వల్ల చెడిపోయారు అని చంద్రమోహన్ తెలిపారు. ఎస్వీ రంగారావు