
Eenadu•6 Nov 2026
ఆ రైలొస్తుందంటే.. గుబులెందుకోహైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబయికి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మార్గానికి అడుగులు వేగంగా ముందుకుపడుతున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం దీనికి సంబంధించి మార్కింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ మార్గమంతా వ్యవసాయ పొలాల మధ్యలో నుంచే వెళ్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న ఏడు బుల్లెట్ రైళ్లలో తెలంగాణకు మూడు రూట్లు ఏర్పాటవుతున్నాయి. దీనిని రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ ప్రకటించడంతో ఖరారైంది. ఆ రైలొస్తుందంటే.. గుబులెందుకో?