ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది అంటున్నారు. మిగతా కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.ఎన్టీఆర్ జిల్లా పాలేరు బ్రిడ్జి దగ్గర 20.2 మిల్లీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 16.8, గుంటూరు జిల్లా తెనాలి 16.4, కర్నూలు జిల్లా దేవనకొండలో 13.8, అన్నమయ్య జిల్లా రాజంపేటలో 10.8, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 10 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు, పల్నాడు, పశ్చిమగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, నెల్లూరు, అల్లూరి సీతామరామరాజు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.ఏపీలో ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించినా సరిపడా వర్షాలు పడలేదు. వాస్తవానికి జూన్ నెలలోనే నైరుతి పవనాలు ప్రవేశించాయి.. సమయంలో తేలికపాటి వర్షాలు కురిశాయి.. ఆ తర్వాత పెద్దగా వానలు పడలేదు. బంగాళాఖాతంలో ద్రోణి, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా సరిపడా వానలు కురవలేదు. రాష్ట్రంలో సరైన వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. చాలామంది రైతులు పంటలు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించింది.. ఈ మేరకు రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎల్నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు
Actor ProfilePolitician
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Jan 2027
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణశాఖ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు