
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికలపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో వేలాది మంది నాన్ అమెరికన్లు ఓటు వేశారంటూ ఆయన తాజా వాదనను తెరపైకి తెచ్చారు. యూఎస్ సెన్సస్ బ్యూరో ఓటర్ల రికార్డులను పౌరసత్వ వివరాలతో సరిపోల్చినప్పుడు ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ పరిణామం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.దీనికి సంబంధించిన వివరాలను తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు ట్రంప్. యూఎస్ సెన్సస్ బ్యూరో ఇప్పటివరకు సుమారు 128,000,000 మంది ఓటర్ల రికార్డులను వారి పౌరసత్వ వివరాలతో సరిపోల్చి చూసిందని, ఈ ప్రాథమిక తనిఖీల్లోనే 24,000 మందికి పైగా నాన్ అమెరికన్లు చట్టవిరుద్ధంగా 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసినట్లు నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య మరింత పెరుగుతుందనీ చెప్పారు.రానున్న రోజుల్లో ఓటర్ల వివరాల విశ్లేషణను మరింత వేగవంతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సెన్సస్ బ్యూరో త్వరలోనే మరో 32,000,000 కోట్ల మంది ఓటర్ల రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించనుందని వెల్లడించారు. ఆ తదుపరి ప్రక్రియ కూడా పూర్తయితే అక్రమ ఓట్ల సంఖ్య ఊహించని రీతిలో భారీగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవన్నీ కూడా బయటపడితే 2020 నాటి ఎన్నికలలో తానే గెలిచినట్టవుతుందని వ్యాఖ్యానించారు.భారత్ ను చూసి నేర్చుకోండి- అర్జంట్ గా ఆ బిల్లు తీసుకురండియూఎస్ ఓటింగ్ ప్రక్రియలో కఠినమైన సంస్కరణలు, గుర్తింపు నియమాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ పనితీరును సైతం ఆయన ప్రశంసించారు.భారత్ లో ఓటర్ ఐడీ తప్పనిసరిగా ఉండటాన్ని ఆదర్శంగా పేర్కొన్నారు. అమెరికన్ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే ముందు ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డులను చూపించేలా నిబంధనలను తీసుకుని రావాలనే పట్టుదలతో ఉన్నారు ట్రంప్.తెలంగాణలో రెండు రోజుల్లో