
విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఇనార్బిట్ మాల్’ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun), ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) సంయుక్తంగా నిర్మించిన ‘AAA సినిమాస్’ (AAA Cinemas) మల్టీప్లెక్స్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్ని లాంఛ్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమైన నగరమని, ఇది దుబాయ్ వంటి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముంబైలో జరుగుతున్న షూటింగ్ నుంచి కేవలం ఒక రోజు విరామం తీసుకుని వైజాగ్ ప్రజలను, అభిమానులను కలవడానికి వచ్చానని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఈవెంట్ వరకు తనని పువ్వులలో పెట్టుకుని తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలని అన్నారు. అలాగే నగర అభివృద్ధికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సహకారం అందించిన వైజాగ్ పోలీస్ విభాగానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైజాగ్ తనకు ఎంతో ఇష్టమైన ఊరని, భోగాపురం విమానాశ్రయంతో పాటు ఇంకా ఇంకా ఇలానే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ అభిమానుల పట్ల చూపించిన ఆప్యాయత అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆయన వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు ఫోటోలు కావాలని కోరగా.. ‘అభిమానులు అడిగితే కాదనడానికి నాకు మనసు రాదు’ అంటూ ఎంతో ఉదారంగా వారిని స్టేజిపైకి ఆహ్వానించారు. అందరినీ ఒక క్రమపద్ధతిలో సురక్షితంగా పైకి రమ్మని కోరి, వారితో ఓపిగ్గా ఫోటోలు దిగారు. అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రశాంతంగా వ్యవహరించాలని కోరడం బన్నీకి అభిమానులపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటిచెప్పింది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన