
గత కొన్ని వారాలుగా తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై యువ నటుడు ధ్రువ్ విక్రమ్ తొలిసారి బహిరంగంగా స్పందించాడు. తన సహనటి అనుపమ పరమేశ్వరన్ గతంలో ఓ రెండేళ్ల సంబంధంలో తాను ఎదుర్కొన్న నియంతృత్వం, నార్సిసిజం గురించి మాట్లాడిన తర్వాత, ఆ వ్యాఖ్యలు ధ్రువ్ను ఉద్దేశించేనని పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ధ్రువ్ మౌనం వీడాడు.‘ఇండియా టుడే తమిళ్’ నిర్వహించిన ఒక రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న ధ్రువ్ను.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటున్నారని ప్రశ్నించగా.. "నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కచ్చితంగా దాని ప్రభావం నాపై పడింది. కానీ, ఇలాంటి సమయంలో వాస్తవానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. మనం ఎవరో, మన విలువేంటో తెలుసుకోవాలి. మనం ప్రేమించే వారిని, మనకు ముఖ్యమైన ప్రతి ఒక్కరినీ కాపాడుకోవాలి" అని ఆయన అన్నారు.బయటివారి అభిప్రాయాల ప్రభావం తనపై ఎక్కువగా ఉండదని చెబుతూ, "మీరు నిజానికి కట్టుబడి ఉన్నప్పుడు, మిమ్మల్ని ఏది నిలబెడుతుందో మీకు తెలిసినప్పుడు, బయటివారి విమర్శలు ఓ స్థాయిని దాటి వెళ్లలేవు. మనకు తెలియకుండానే మనం ఒంటరి సైన్యంలా మారతాం. మనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని, మన అంతర్గత బలాన్ని కాపాడుకుంటాం" అని ధ్రువ్ వివరించాడు.ప్రముఖుల జీవితాల్లో ఇలాంటి పరిశీలన సర్వసాధారణమే అయినా, తన ప్రియమైన వారిని కాపాడుకోవడం, వ్యక్తిగత హద్దులు గీసుకోవడం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నాడు. అయితే, ఈ సంభాషణలో ఆయన ఎక్కడా అనుపమ