
మైదుకూరు : సొంత అన్ననే గొడ్డలితో నరికి హతమార్చాడో తమ్ముడు. ఈ ఘటన ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురేశ్ పొక్లెయిన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సురేశ్ చికెన్ పకోడా తీసుకుని ఇంటికి వచ్చాడు. శనివారం చికెన్ పకోడా ఎలా తెస్తావంటూ సోదరుడు వద్దిరాల వెంకటసుబ్బయ్య(42).. సురేశ్ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీన్ని మనసులో పెట్టుకున్న సురేష్ ఆదివారం ఉదయం మద్యం మత్తులో మంచంపై నిద్రిస్తున్న వెంకట సుబ్బయ్యను గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.