
కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం పుల్లారెడ్డి పల్లె గ్రామంలో తాగునీటి పైపులు పగిలి నీరంతా వృథాగా ప్రవహిస్తోంది. తాగునీరు కలుషితం కావడంతోపాటు రహదారి బురదమయంగా మారింది. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి హబీబా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రెండు రోజుల్లో పగిలిన పైపులకు మరమ్మతులు చేయించి, నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈనాడు కథనానికి స్పందన.. రహదారి ఆక్రమణల తొలగింపు కలసపాడు: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలోని చెన్నుపల్లి ప్రధాన రహదారిపై రహదారి, మురుగు కాల్వల ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 10న ‘వర్షం కురిస్తే.. రోడ్లన్నీ నీటిమడుగులే’అనే శీర్షిక పేరిట ఈనాడులో కథనం ప్రచురితమైంది. ఎంపీడీవో మహబూబ్బీ, డిప్యూటీ ఎంపీడీవో మురళీమోహన్, పీడీవో సదాశివరెడ్డి స్పందించారు. గురువారం చెన్నుపల్లి ప్రధాన రహదారిపై పీడీవో సదాశివరెడ్డి యంత్రాలను ఏర్పాటు చేసి, దగ్గరుండి ఆక్రమణల తొలగింపు, మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు