
ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటనతో టాటా గ్రూప్ నాయకత్వంలో మరోసారి అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు టాటా సన్స్ (Tata Sons) పగ్గాలను ఎవరు చేపడతారనేది కార్పొరేట్ వర్గాల్లో పెద్ద ప్రశ్నగా మారింది. కాగా.. ఈ పదవి రేసు (Tata Succession)లో టీవీ నరేంద్రన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈయన ఎవరు..? ఛైర్మన్గా బాధ్యతలు చేపడితే.. ఆయన ముందున్న సవాళ్లేంటీ? 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ (TV Narendran) ప్రస్తుతం టాటా స్టీల్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. తదుపరి ఛైర్మన్గా ఈయన పేరును టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. నరేంద్రన్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేట్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. టీవీ నరేంద్రన్ తిరుచిలోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత ఐఐఎం కలకత్తా నుంచి మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన.. 1988లో టాటా గ్రూప్లో చేరారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే గ్రూప్లో పనిచేస్తున్నారు. తొలినాళ్లలో సేల్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి విభాగాల్లో పనిచేశారు. ఆగ్నేయ ఆసియాలో టాటా స్టీల్ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. 2013లో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నరేంద్రన్.. ఆ తర్వాత సీఈఓగా పదోన్నతి పొందారు. కాగా.. తదుపరి ఛైర్మన్ రేసులో ఈయనతో పాటు నోయెల్ టాటా, సౌరభ్ అగర్వాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రశేఖరన్ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోగా కొత్త ఛైర్మన్ను టాటా సన్స్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్కు మూడు కీలక సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా, టాటా డిజిటల్, టాటా ఎలక్ట్రానిక్స్ విభాగాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా నష్టాలు దాదాపు రెండు రెట్లు పెరిగి రూ.22,238 కోట్లకు చేరాయి. అహ్మదాబాద్