
MAD
<figure><img src="https://static.10tv.in/wp-content/uploads/2026/09/AP-Weather-Update-1024x576.jpg" class="attachment-large size-large wp-post-image" alt="AP Weather Update" decoding="async" fetchpriority="high" /></figure><ul> <li><strong>ఏపీలో బుధవారం పలు జిల్లాలకు వర్ష సూచన</strong></li> <li><strong>తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి</strong></li> <li><strong>పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై విస్తరించిన ఉపరితల ఆవర్తనం</strong></li> <li><strong>వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలకు అవకాశం</strong></li> </ul> <p><strong>Weather Update :</strong> తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. వర్షం ముంచుకువస్తోంది. ఏ క్షణమైనా వర్షాలు పడొచ్చు. ఏపీలో బుధవారం (సెప్టెంబర్ 9) పలు జిల్లాలకు వర్షం సూచన కనిపిస్తోంది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.</p> <p>పశ్చిమ మధ్య బంగాళాఖాతం, కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం విస్తరించగా వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఏపీ (Weather Update) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.</p> <p>ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.</p> <p><strong>Read Also : <a href="https://10tv.in/telugu-news/telangana/telangana-assembly-brs-mlcs-tata-madhu-naveen-kumar-reddy-suspended-sh-1134364.html">Telangana Assembly : తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్.. ఎప్పటివరకంటే?</a></strong></p> <p>అదే సమయంలో అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడే పరిస్థితులు ఉన్నాయి.</p> <p><strong>పిడుగులతో తేలికిపాటి వర్షాలు : </strong><br /> దక్షిణ కోస్తా వైపు చూస్తే.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాయలసీమలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.</p> <p>ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మి.మీ., పెంటపాడులో 27.6 మి.మీ. వర్షం కురిసింది. చందర్లపాడు, పండ్రపాడులో 24 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.</p> <p>ఆకస్మిక వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది.