
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,900 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,42,910గా నమోదైంది.అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. దీంతో పసిడికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నగరాల్లో 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,930గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులకు అనుగుణంగా దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి
.