
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఏకంగా 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి వెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.





