
ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ.. మొత్తం ఓటర్ల 3.38 కోట్లు..! తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఈ భారీ తనిఖీ కార్యక్రమం ముగియడంతో రాష్ట్రంలో త్వరలోనే ప్రచురించబోయే ఓటర్ల జాబితాలో ఊహించని రీతిలో భారీ ప్రక్షాళన జరగనుందని స్పష్టమవుతోంది. ఎన్నికల అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో ఇప్పటివరకు సేకరించిన సమాచార ఆధారంగా సుమారు 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. అంటే దాదాపు 78.30 శాతం నమోదు ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ రీ-సర్వేలో సుమారు 73.39 లక్షల ఫారాలను సేకరించలేకపోయినట్లు అధికారులు ‘అన్కలెక్టబుల్’ జాబితాలో చేర్చారు. ప్రధానంగా నివాస స్థలాలను వదిలి శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 45.18 లక్షల మంది ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే 9.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీనికితోడు దాదాపు 11.25 లక్షల మంది ఓటర్ల అడ్రస్ దొరక్క జాడ లేకుండా పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో 6.70 లక్షల మందికి పైగా ఓటర్లకు వేర్వేరు నియోజకవర్గాలు లేదా ప్రాంతాలలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణాల వల్ల మొత్తం ఓటర్ల సంఖ్యలో ఏకంగా 21 శాతానికి పైగా కోత పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించి ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ సర్వేను చేపట్టింది. ఎన్నికల ముంగిట ఇలాంటి నిశితమైన ప్రక్షాళన జరగడం ద్వారా రాబోయే ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బోగస్ ఓట్ల తొలగింపుపై ప్రజా సంఘాలు మరియు రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అర్హులైన ఏ ఒక్క నిజమైన