
హైదరాబాద్: కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల అంశంలో తాను చెప్పాల్సింది క్రమశిక్షణ కమిటీకి చెప్పానని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. ఈ విషయంపై ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని చెప్పారు. ‘‘నేను చెప్పాల్సింది నిన్ననే క్రమశిక్షణ కమిటీకి చెప్పా. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయాలేమీ లేవు. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక మాట్లాడతాను’’అని కొండా సురేఖ అన్నారు. ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్కు వివరణ పంపారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని.. ఈ విషయంలో తనను బాధ్యురాలిని చేయొద్దని అందులో కోరారు. మరోవైపు కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్గా తీసుకొన్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మంత్రి కుమార్తె చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణా రాహిత్యంగా భావించి నోటీసులివ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తహసీల్దార్ కార్యాలయంలో వాష్రూమ్ శుభ్రం చేశారు