విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేబోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం.. ఏపీ రాజకీయాల్లో ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనటం, మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం కూడా సీరియస్ అయ్యింది. బోండా ఉమాను పిలిచి వివరణ కూడాతీసుకుంది. ఇదే సమయంలోవైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దంటూ తమ నేతలకు కూడా టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదికను పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయివిజయవాడ చిట్టినగర్లో ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా బీజేపీ నేత పోతిన బేసు కంటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకమండలి సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని , విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి బుద్ధా వెంకన్న , జనసేన నేత సామినేని ఉదయభాను, వైసీపీ నేత పోతిన మహేష్ సహా.. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. ఆలయ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని కోరారు. నగరాల కులానికి చెందిన వారితో పాటుగా అన్నివర్గాల కోసం పనిచేయాలని సూచించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనన్నారు సుజనా చౌదరి. అయితే బోండా ఉమా, అంబటి రాంబాబు ఎపిసోడ్, వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం సూచనల నేపథ్యంలో.. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ నేత పోతిన మహేష్తో ఒకే వేదికపై కనిపించడం