
మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ గ్లోబల్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ పాడ్కాస్ట్లో మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజమౌళితో వర్క్ చేయడానికి 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. మహేష్ ఇంకా ఏం చెప్పారంటే...
Tags:#ssmb29
Found this helpful?
Share this story with your network