
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో ఏడవ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. చివరి ఎపిసోడ్ లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయని ఇద్దరు కంటెండర్స్ ని జ్యూరీ సభ్యులు స్టేజీపైకి పిలిచారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు ఉటా అండ్ అపూర్వ. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ ఒక్కో కార్డుని ఎంచుకోవాలి. ఎవరి కార్డులో ఎగ్జిట్ అని ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఆ దురదృష్టం ఉటాకే తగిలింది. ఉటా ఎంచుకున్న కార్డులో ఎగ్జిట్ అని ఉంది. అపూర్వ ఎంచుకున్న కార్డులో స్టే అని ఉంది. దీనితో అపూర్వ సేవ్ అయింది. ఉటా మాత్రం ఎలిమినేట్ అయ్యారు. ఎక్కడో జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని ఇంత కష్టపడిన ఉటాని జ్యూరీ సభ్యులు అభిజీత్, బిందు మాధవి, నవదీప్ అభినందించి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత డేర్ ఆర్ డై లో భాగంగా వరుసగా టాస్కులు మొదలయ్యాయి. ముందుగా అత్యంత ఘాటైన ఘోస్ట్ పెప్పర్ చిల్లీతో టాస్క్ మొదలైంది. ఆ చిల్లీ భరించలేని కారంతో ఉంటుంది. ఈ టాస్క్ లో దీపక్, అమన్, సుమ, లయ పాల్గొన్నారు. వీళ్ళు ముందుగా ఘోస్ట్ పెప్పర్ చిల్లీ తిని ఆ తర్వాత బెలూన్స్ ఊది పగలగొట్టాలి. కారాన్ని భరిస్తూ ఇది చేయాలి. ఈ టాస్క్ లో దీపక్ విజయం సాధించారు. అమన్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు. నెక్స్ట్ టాస్క్ లో అబ్బాయిలు పియర్సింగ్ చేయించుకోవాలి. చెవి, ముక్కు, ఐబ్రోస్ లలో రెండు భాగాలు ఎంచుకుని పియర్సింగ్ చేయించుకోవాలి. ఈ టాస్క్ లో రోహిత్, హేమంత్ పాల్గొన్నారు. వీళ్ళిద్దరూ ముక్కు కుట్టించుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఎవరైతే ముక్కుకి ఓకె అని అంటారో వాళ్ళని విన్ చేద్దాం అని అనుకున్నా అంటూ బిందు మాధవి పేర్కొంది. దీనితో హేమంత్ వెంటనే నాకు ఓకె అని చెప్పాడు. రోహిత్ మాత్రం అంగీకరించలేదు. రోహిత్ ఆసక్తి చూపించకపోవడం అభిజీత్ కి