
Smriti Mandhana: దుబాయ్ వేదికగా జరిగిన మహిళా ఆసియా కప్ తుది పోరులో భారత జట్టు శ్రీలంకను చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్లు స్మృతి మంధాన అలాగే షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించారు. నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు సాధించడంలో ఈ ఇద్దరి భాగస్వామ్యం అత్యంత ప్రధానమైంది. ముఖ్యంగా స్మృతి మంధాన కేవలం 39 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తనవంతు బాధ్యత నిర్వర్తించింది. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆమె ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్సును ఎంతగానో ఆకట్టుకుంది.





