
వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికర టైటిల్ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమా ప్రారంభించిన రోజే విడుదల తేదీని కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. "మా చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నాం. సంక్రాంతికి హ్యాట్రిక్ విజయాలు సాధించిన చరిత్ర శర్వానంద్కు ఉంది. ఇప్పుడు 'జార్జ్ క్రిష్' చిత్రంతో ఆ సెంటిమెంట్ను కొనసాగించబోతున్నాడు" అని ధీమా వ్యక్తం చేశారు. శర్వానంద్కు గతంలో ‘శతమానం భవతి’, ‘ఎక్స్ప్రెస్ రాజా’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు సంక్రాంతి సీజన్లో మంచి విజయాలు అందించాయి. ఇప్పుడు అదే సెంటిమెంట్తో ఈ సినిమా కూడా పండుగ బరిలో నిలవనుంది.హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు షాట్కు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టారు. తొలి షాట్కు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఏటీవీ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ప్రారంభోత్సవం రోజే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ల జాబితాను ప్రకటించడం. సాధారణంగా