
సదాబహార్..బిళ్ళ గన్నేరు పువ్వులు కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, అద్భుతమైన ఆయుర్వేద మూలికగా పనిచేస్తాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఈ పువ్వులు, ఆకులలో ఉండే ప్రత్యేక గుణాలు మధుమేహం వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. సదాబహార్ మొక్కలో వింక్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అనే అల్కలాయిడ్లు ఉంటాయి. ఈ పువ్వులు లేదా ఆకులను కషాయంలా చేసుకుని లేదా నమలడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.






