
మాజీ మంత్రి, నటి రోజా ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఆమె జీ తెలుగులో పలు షోస్ చేస్తోంది. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గానే ఉంది. వైఎస్ఆర్సీపీలో కీలక నాయకురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో ఆ జోరు తగ్గించింది. ఇటు టీవీ, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తుంది. అదే సమయంలో అధికార పక్షాన్ని విమర్శించే విషయంలోనూ కొంత మాట వేడి తగ్గించింది. ఇదిలా ఉంటే రోజా వైసీపీలోకి రావడానికి ముందు టీడీపీలో చేరింది. హీరోయిన్గా కెరీర్ పీక్లో ఉన్నప్పుడే ఆమెకి రాజకీయాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఆఫర్ చేయడంతో 1998లో ఆమె టీడీపీలో చేరింది. మహిళా వింగ్కి అధ్యక్షురాలిగా వర్క్ చేశారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నాయకురాలిగా మారిపోయింది రోజా. 2004లో ఆమె నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత 2009లోనూ చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పింది. వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్సీపీలో చేరింది. ఆ తర్వాత నగరి నుంచే ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందింది. గత టర్మ్ లో మంత్రిగానూ పనిచేసింది. ఇదిలా ఉంటే టీడీపీ గుడ్ బై చెప్పిన తర్వాత కొంత కాలం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది రోజా. ఆ సమయంలో మంచు లక్ష్మికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. టీడీపీకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో వెల్లడించింది. చంద్రబాబు నాయుడిని తాను అన్నగా భావించానని, ఆయన గెలుపుకోసం ఒక చెల్లిగా పనిచేశానని తెలిపింది. అయితే కొంత మంది లీడర్లు తన ఎదుగుదలని చూసి ఓర్వలేకపోయారని, తాను ఓడించేందుకు కుట్ర చేశారని, తనని డౌన్ చేసే ప్రయత్నం చేశారని తెలిపింది. తనపై ఇంత చేస్తున్నా, చంద్రబాబు నాయుడు వారిపై యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి రియాక్షన్ లేదు. దీంతో