
‘అగ్నిపరీక్ష’ వేదికపై రాజకుమారి చెప్పిన కన్నీటి కథ అందరినీ కదిలించింది. ముగ్గురు పిల్లల కోసం ఆమె చేసిన పోరాటం వైరల్గా మారింది. బిగ్బాస్ 10లోకి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. కష్టాల కడలిని దాటి.. కన్నీళ్లను దిగమింగి.. ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా పోరాడిన ఓ మహిళ కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకుమారి (Rajakumari) జీవిత ప్రయాణం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఎన్నో అవమానాలు, అన్యాయాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడిన ఆమె.. ‘అగ్నిపరీక్ష’ వేదికపై తన మాటలతో అందరినీ కదిలించింది. త్వరలో ప్రారంభం కానున్న ‘బిగ్బాస్ 10’ (Bigg Boss 10 Telugu) కోసం సామాన్యుల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమంలో నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. కంటెస్టెంట్లకు ఆసక్తికరమైన టాస్క్లు ఇస్తూ.. వారి ప్రతిభతో పాటు జీవిత కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకుమారి చెప్పిన తన జీవిత కథ ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. చిన్న వయసులోనే రాజకుమారికి ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆమె నల్లగా ఉందనే కారణంతో మొదటి భర్త మరో వివాహం చేసుకుని ఆమెకు తీవ్ర అన్యాయం చేశాడు. ఆ బాధ నుంచి కోలుకునేలోపే కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేశారు. అయితే రెండో వివాహం కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేదు. భర్త బాధ్యతలను వదిలేసి వెళ్లిపోవడంతో ముగ్గురు చిన్నారులతో కలిసి ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. చేతిలో డబ్బు లేదు.. ఉండేందుకు సరైన చోటు లేదు.. పిల్లలను చూసుకునే తోడు లేదు. అయినా రాజకుమారి కుంగిపోలేదు. పిల్లల ఆకలి కేకలు తనను మరింత బలంగా మార్చాయి. ఆత్మహత్య ఆలోచనలను పక్కన పెట్టి.. తన పిల్లల భవిష్యత్తు కోసం జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తన పిల్లలను పెంచేందుకు ఆమె సాగించిన