
గుంటూరు-రాయగడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ అలర్ట్ జారీ చేసింది. అంతర్గత కారణాల వల్ల గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (Rayagada-Guntur Express) రైలు రాకపోకల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో రెండు స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న టైమింగ్స్ ను మారుస్తూ రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు వీటిని గమనించి తమ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.విశాఖపట్నం-ప్రయాగ్ రాజ్ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- ఇక ప్రతీ వారం..!రాయగడ నుంచి గుంటూరుకు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 17244 టైమింగ్స్ లో ఈ మార్పు చోటు చేసుకుంది. రాయగడ స్టేషన్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలును ఇకపై 2.50కే బయలుదేరేలా మార్పు చేశారు. అలాగే జిమిడిపేట స్టేషన్లో ఈ రైలు మధ్యాహ్నం 3.16కు చేరుకోవాల్సి ఉండగా.. ఇకపై దీన్ని 3.06కు అంటే 10 నిమిషాల ముందుగా వచ్చేలా మార్పు చేశారు. దీంతో జిమిడిపేట స్టేషన్లో బయలుదేరాల్సిన సమయం కూడా 3.18 నుంచి 3.08కి మారింది. ఈ మార్పులు ఆగస్టు 24 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) అధికారులు ప్రకటించారు. రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంది. ఇప్పటివరకూ రాయగడలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 4.50కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయాణించే రూటులో దాదాపు 30 హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతానికి రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలుకు మాత్రమే ఈ టైమింగ్స్ లో మార్పు చేశారు. గుంటూరు-రాయగడ