
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Raidurg land auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన ఆన్లైన్ ఈ-వేలంలో రాయదుర్గం ఐటీ కారిడార్లోని స్థలాలు ఊహించని రీతిలో రికార్డు ధరలను పలికాయి. ఈ వేలంలో రాయదుర్గం పరిధిలోని P1 ప్లాట్ ఎకరం ఏకంగా రూ. 264 కోట్లకు అమ్ముడుపోయి, హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూమిగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ చారిత్రాత్మక వేలంలో 'P1' ప్లాట్ మొత్తం విస్తీర్ణం 5.25 ఎకరాలు. ఎకరాకు రూ. 264 కోట్ల బిడ్ లెక్కన ఈ ఒక్క ప్లాట్ అమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక కనీస ధర కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య సాగిన తీవ్ర పోటీని తట్టుకుని 'MSN రియాల్టీస్' సంస్థ ఈ ప్రైమ్ ప్లాట్ను దక్కించుకుంది. ఈ కొత్త బెంచ్మార్క్ ధరతో గతంలో నమోదైన రికార్డులన్నీ బద్దలయ్యాయి. 2022లో హెచ్ఎమ్డీఏ నిర్వహించిన వేలంలో ఎకరం రూ. 100 కోట్లు పలికి సంచలనం సృష్టించింది. 2025 అక్టోబర్ రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లుగా నమోదై అప్పటికి రికార్డుగా నిలిచింది.ప్రస్తుతం ఏకంగా రూ. 264 కోట్లకు చేరుకుని, కోకాపేటను అధిగమించి రాయదుర్గం నగరంలోనే నంబర్ 1 ఖరీదైన ప్రాంతంగా అవతరించింది. హైదరాబాద్లోని అత్యంత కీలకమైన 'నాలెడ్జ్ సిటీ' పరిధిలో ఈ ప్లాట్ ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణం. టీ-హబ్, మై హోమ్ భూజా, ఐటీసీ