
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మరో ఆసక్తికరమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మార్కాపురం (Markapuram) జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు మార్చాలనే డిమాండ్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి (Kandula Narayana Reddy) అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తూ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu)కు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా (Prakasam)లో చాలాకాలంగా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో జిల్లా కేంద్రం ఏర్పాటైతే అభివృద్ధి వేగం పెరుగుతుందని స్థానికులు భావిస్తూ వచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సమయంలోనూ ఈ డిమాండ్ బలంగా వినిపించింది. అయితే అప్పట్లో మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను గుర్తించారు. తాము అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీకి అనుగుణంగా కొత్త జిల్లా ఏర్పాటు జరిగింది. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో సంతోషం వ్యక్తమైంది. ప్రస్తుత మార్కాపురం జిల్లా పరిపాలనా పరిధిలో మొత్తం 21 మండలాలు ఉన్నాయి. మార్కాపురం ప్రాంతానికి చెందిన 15 మండలాలతో పాటు కనిగిరి (Kanigiri) పరిధిలోని మరో ఆరు మండలాలను కలిపి జిల్లాను రూపొందించారు. మార్కాపురం, గిద్దలూరు (Giddalur), కనిగిరి మున్సిపాలిటీలతో పాటు పొదిలి (Podili) నగర పంచాయతీ కూడా ఇందులో ఉన్నాయి. వందలాది గ్రామ పంచాయతీలు జిల్లా పరిధిలోకి రావడంతో ప్రజలకు పరిపాలన మరింత చేరువవుతుందనే అభిప్రాయం ఉంది. మార్కాపురం జిల్లాకు ప్రత్యేకమైన భౌగోళిక ప్రాధాన్యత కూడా