
Parivartini Ekadashi Puja Vidhi Telugu: హిందూ మతంలో ఏకాదశి తిథికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో భాద్రపద మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని పరివర్తినీ ఏకాదశిగా పిలుస్తారు. దీనినే పద్మ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, జలఝులని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఆచరించడం ఆనవాయితీ. అయితే 2026లో పరివర్తినీ ఏకాదశి తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఏకాదశి తిథి ఒక రోజు ప్రారంభమై మరుసటి రోజు వరకు కొనసాగడం ఇందుకు కారణం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది పరివర్తినీ ఏకాదశి సెప్టెంబర్ 22న ఆచరించాలి. ఉపవాస పారణను సెప్టెంబర్ 23న నిర్వహిస్తారు.




