ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత .. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ నివాసానికి వెళ్లారు. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం గత ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సునీత తనయులు పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే కొన్ని కారణాల వలన పరిటాల సునీత బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు.. ఫిల్మ్ నగర్లోని బండ్ల గణేష్ నివాసానికి పరిటాల సునీత వెళ్లారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ కుటుంబం.. పరిటాల సునీతకు సాదర స్వాగతం పలికింది. అనంతరం బండ్ల గణేష్ కుమార్తె, అల్లుడికి పరిటాల సునీత.. ధర్మవరం పట్టువస్త్రాలు అందించి ఆశీర్వదించారు. బండ్ల గణేష్ కుటుంబసభ్యులతో కాసేపు ఆత్మీయంగా గడిపారు. శ్రీరాములయ్య సినిమా అప్పటి నుంచి పరిటాల కుటుంబంతో బండ్లగణేష్కు అనుబంధం ఉంది.పరిటాల సునీత తమ ఇంటికి వచ్చిన విషయాన్ని బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఫోటోలను పంచుకున్నారు. "మా ఆత్మీయురాలు, మా వదిన పరిటాల సునీత ఈరోజు ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి, నా కుమార్తెను, అల్లుడిని ఆశీర్వదించి వెళ్లడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మీరు చల్లగా, చక్కగా, ఆనందంగా ప్రజా సేవ చేస్తూ, పరిటాల రవన్న పేరును ఇంకా చిరస్థాయిగా నిలిచే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. వదినమ్మ అని పిలవడంతోనే పరిటాల కుటుంబానికి, బండ్ల గణేష్కు ఉన్న అనుబంధం తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్ట్ 16వ తేదీ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల 58 నిమిషాలకు వరుడు సూర్యతేజ.. జననిమూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు